• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఫడణవీస్ ప్రమాణ స్వీకారంపై విచారణ రేపటికి వాయిదా

Published on : November 24, 2019 at 1:23 pm

మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఫడణవీస్ తనకు మెజార్టీ ఉందని గవర్నర్ కు ఇచ్చిన లేఖను కోర్టుకు సమర్పించాల్సిందిగా సొలిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

 గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడంపై శివసేన-ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శనివారం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్లు దాఖలు చేశాయి. ఆదివారం సుప్రీంకోర్టుకు సెలవు దినం అయినప్పటికీ ఈ పిటిషన్లపై ఈరోజు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం విచారణ చేపట్టింది. శివసేన-ఎన్సీపీ ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ , మాజీ కేంద్ర మంత్రి  కపిల్ సిబాల్, కాంగ్రెస్ తరపున  సుప్రీంకోర్టు అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా…ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ, సొలిషిటర్ జనరల్ తుషార్ మెహతాలు హాజరయ్యారు. గవర్నర్ చర్య వినూత్నంగా ఉందని..మెజార్టీ లేకపోయినప్పటికీ ఫడణవీస్  చేత ప్రమాణ స్వీకారం చేయిండం రాజ్యాంగ విరుద్ధమని శివసేన, కాంగ్రెస్ తరపు న్యాయవాదులు వాదించారు. నిజంగా వారికి మెజార్టీ ఉంటే వెంటనే  ప్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరారు. గతంలో కర్ణాటకలో కూడా ఇదే జరిగిందని ఉదాహరించారు. మద్దతు నిచ్చే ఎమ్మెల్యేల చేత పరేడ్ నిర్వహించాలని కోరారు.

గవర్నర్ చర్య కోర్టు సమీక్ష పరిధిలోకి రాజాలదని..గవర్నర్ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏ చర్యనైనా తీసుకుంటారని ప్రభుత్వం తరపున సొలిషిటర్ జనరల్ వాదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు తగిన మెజార్టీ ఉందని ఫడణవీస్ గవర్నర్ కు లేఖ ఇచ్చినందునే గవర్నర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. దీంతో ఫడణవీస్ గవర్నర్ కు సమర్పించిన లేఖను సోమవారం పదిన్నర గంటలకు కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

tolivelugu app download

Filed Under: రాజకీయాలు, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

మ‌రోసారి వివాదాల్లో సైఫ్ అలీఖాన్

మ‌రోసారి వివాదాల్లో సైఫ్ అలీఖాన్

చైతూ ఫోటోకు స‌మంతా కామెంట్- వైర‌ల్

చైతూ ఫోటోకు స‌మంతా కామెంట్- వైర‌ల్

మ‌రో మూవీకి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

మ‌రో మూవీకి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

బాక్స‌ర్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చేశాడోయ్

బాక్స‌ర్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చేశాడోయ్

ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్...బాలయ్య

ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్…బాలయ్య

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఎన్నిక‌ల ముందు ఖ‌మ్మం టీఆర్ఎస్ లో పొంగులేటి అస‌మ్మ‌తి రాగం

ఎన్నిక‌ల ముందు ఖ‌మ్మం టీఆర్ఎస్ లో పొంగులేటి అస‌మ్మ‌తి రాగం

అశోక్ గ‌జ‌ప‌తిరాజున మ‌ళ్లీ టార్గెట్ చేసిన సంచ‌యిత‌

అశోక్ గ‌జ‌ప‌తిరాజున మ‌ళ్లీ టార్గెట్ చేసిన సంచ‌యిత‌

రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీపై సుప్రీం విచార‌ణ‌

రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీపై సుప్రీం విచార‌ణ‌

తెలంగాణలో నేడు కరోనా కేసులెన్నంటే?

తెలంగాణలో నేడు కరోనా కేసులెన్నంటే?

వ్యాక్సిన్ తీసుకున్న మ‌రుస‌టి రోజే హెల్త్ వ‌ర్క‌ర్ దుర్మ‌ర‌ణం

వ్యాక్సిన్ తీసుకున్న మ‌రుస‌టి రోజే హెల్త్ వ‌ర్క‌ర్ దుర్మ‌ర‌ణం

ప్ర‌త్యేక దేశం కోసం పాకిస్తాన్ లో మోడీ ప్ల‌కార్డుల‌తో ర్యాలీ

ప్ర‌త్యేక దేశం కోసం పాకిస్తాన్ లో మోడీ ప్ల‌కార్డుల‌తో ర్యాలీ

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)