రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దూకుడు పెంచారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారన్న ఆరోపణలతో అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నారు. తాజాగా కమిషన్ సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్ను తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్కు లేఖ రాశారు. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషన్లో అవసరం లేదని, వాణీమోహన్ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికకే రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్పై సోమవారం క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్నారు. 30 రోజులపాటు సెలవుపై వెళ్లిన సాయిప్రసాద్… ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. ఇది క్రమశిక్షణారాహిత్యమని, ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయంటూ సాయి ప్రసాద్ను విధుల నుంచి ఈసీ తొలగించింది.