కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ అగ్నిపథ్ నిరసనలు తెలంగాణను సైతం తాకాయి. ఈ నేపథ్యంలో బస్సులపై ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రెండు రైలు బోగీలకు నిప్పంటించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. దేశ వ్యాప్తంగా పలు రైల్యే జోన్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్ల వద్ద అదనపుల బలగాల మోహరించాయి. కాజీపేట రైల్వే జంక్షన్, వరంగల్ రైల్వేస్టేషన్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ను పూర్తిగా మూసివేశారు రైల్వే శాఖ అధికారులు.
రైల్వే పోలీసులతో పాటు సివిల్ పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. భద్రత పెంచి, నిఘా కట్టుదిట్టం చేయాలని శాఖాధిపతులు, సెక్రెటరీలకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు.
Advertisements
భద్రతా చర్యల్లో భాగంగా కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ లలో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను స్టేషన్ లోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.