ఉక్రెయిన్ పై రష్యా వార్ డిక్లేర్ చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఉదయం నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సైతం రష్యాకు దీటుగా పోరాడుతోంది. అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్న రష్యా… ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే కుట్రలకు పాల్పడుతోంది.
ఈ యుద్ధ ప్రభావంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లను దాటింది. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మన దేశీయ మార్కెట్లు కుప్పకూలిపోయాయి.
సెన్సెక్స్ ఏకంగా 2,702 పాయింట్లు పతనమయ్యాయి. నిఫ్టీ 815 పాయింట్లు కోల్పోయి 16,247కి దిగజారింది. దీంతో గురువారం అన్ని సూచీలు భారీగా నష్టపోయాయి. రియాల్టీ సూచీ 7.59 శాతం ఆటో, టెలికాం సూచీలు 6 శాతానికి పైగా కోల్పోయాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్ -7.88%, మహీంద్రా అండ్ మహీంద్రా -6.15%, బజాజ్ ఫైనాన్స్ -6.02%, యాక్సిస్ బ్యాంక్ -5.99%, టెక్ మహీంద్రా -5.75% తో టాప్ లూజర్స్ గా ఉన్నాయి.