వరుసగా నాలుగు రోజుల పాటు దేశంలో బ్యాంకులకు మూతపడనుంది. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వతేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అంటే మార్చి 15, 16వ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇక మార్చి 13వతేదీన రెండవ శనివారం కాగా, మార్చి 14వతేదీ ఆదివారం సెలవు. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.
పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండవ శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం మార్చి నెలలో 11 రోజులపాటు బ్యాంకు శాఖలు పనిచేయవు. స్థానిక సెలవులతో కలిసి 11 రోజులు బ్యాంకు పనిచేయనందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి. మార్చి 11వతేదీన మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించారు. మార్చి 22వతేదీన బీహార్ దివస్, మార్చి 30న హోలి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
అయితే, సెలవులు ఉన్నప్పటికీ… మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగదని బ్యాంకులు ప్రకటించాయి.