ఏపీ హైకోర్టులో జడ్జీలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏపీ హైకోర్టులో నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకారం జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నూతన న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు.
జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ సుజాత, జస్టిస్ రవి, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రాజశేఖర్ రావు, జస్టిస్ వెంకటేశ్వర్లు తదితరులు జడ్జిలుగా ప్రమాణం చేయనున్నారు.
ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం.. ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేసింది. దానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నియామకాలతో ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య 27కి పెరిగింది.
నిబంధనల ప్రకారం ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం నిబంధనల కంటే తక్కువ మంది న్యాయమూర్తులు ఉన్నారు.