ఏఏపీ టీడీపీలో విషాదం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్రాజు(72) అనారోగ్యంతో కన్నుమూశారు. పాత నాగూరు నియోజకవర్గం నుంచి 1989-94 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైసీపీలో కొంతకాలం పాటు పనిచేసిన ఆయన ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు నచ్చక తిరిగి టీడీపీలో చేరారు.
శత్రుచర్ల మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శత్రుచర్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు లోకేష్ పేర్కొన్నారు.
Advertisements
కురుపాం ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి శత్రుచర్ల స్వయానా మేన మావ అవుతారు. అంతేకాకుండా మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు కూడా.