తమిళ హీరో శింబుకు వివాదాలు కొత్తేమి కాదు. గతంలో చాలాసార్లు పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగిన ఈ స్టార్ హీరో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. హీరో శింబు కారు ఢీ కొనడంతో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. అయితే, ఈ ఘటన చెన్నైలో మార్చి 18న జరగగా, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
Cctv footage of a differently abled man being run over by a car that belonged to actor Simbu’s father and director T Rajendran at T Nagar @TOIChennai pic.twitter.com/WBvveHkk54
— SINDHU KANNAN (@SindhukTOI) March 23, 2022
Advertisements
ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో శింబు మినహా అతడి తండ్రి డైరెక్టర్, నటుడు రాజేంద్రన్, కుటుంబసభ్యులు అంతా కారులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే వృద్ధుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించేందుకు రాజేంద్రన్ అంబులెన్స్ని కూడా పిలిపించారు. అయితే అంబులెన్స్ చేరుకునే లోపు సదరు వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వృద్ధుడిని మునిస్వామి అనే దివ్యాంగుడిగా గుర్తించారు. అతను రోడ్డుపై పాకుకుంటూ వెళ్లేది డ్రైవర్కి కనపడలేదని వారు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత రోజే కారు నడిపిన డ్రైవర్ని పోలీసులు అరెస్టు చేశారు. పాండి బజార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు మొదట్లో ఐపీసీ సెక్షన్ 337 279 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తరువాత, వారు ఐపీసీ 304(ఏ)గా కేసును మార్చినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సెల్వంను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. సమీపంలోని కొన్ని నివాసాలు, దుకాణాల్లోని సీసీటీవీ కెమెరాల నుండి సేకరించిన ఫుటేజీని పోలీసులు తనిఖీ చేసి ఆధారాలు సేకరించారు.
పోలీసుల దర్యాప్తులో తన మనవరాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రాజేంద్రన్ చెప్పారు. వృద్ధుడికి రూ.30 వేలు పరిహారం ఇస్తామని తమతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే వృద్ధుడు మరణించిన తర్వాత రాజేంద్రన్ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారని వెల్లడించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారును స్వాధీనం చేసుకున్నారు.