షిర్డీ సాయిబాబా ఆలయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. బాబాకు తొలిసారి లౌడ్ స్పీకర్లు లేకుండా కాకడ్ హారతి నిర్వహించారు ఆలయ అధికారులు. బుధవారం రాత్రి నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో లౌడ్స్పీకర్లపై వివాదం నేపథ్యంలో ఇలా చేశారు.
షిర్డీలో సాయిబాబా అరవై సంవత్సరాలకు పైగా జీవించి, సబ్కా మాలిక్ ఏక్ సందేశాన్ని అందించారు. అన్ని మతాలను సమానంగా బోధించారు. షిర్డీలోని శిథిలావస్థలో ఉన్న మసీదులో సాయిని ధుజ్వలిత్ కేలీ బాబా మసీదుమాయిని, ద్వారకామాయి అని పిలవడం ప్రారంభించారు. సాయి సమాధి సమీర్ హిందువులు, ముస్లింలు ప్రతిరోజు సాయి మందిరానికి వచ్చి సమాధిపై పూలతో సాయి సమాధికి నివాళులర్పిస్తారు. సాయి సమాధికి ఉత్తరం వైపున ముస్లింలు నిలబడి, దక్షిణం వైపున హిందూ గ్రామస్థులు పూలతో ప్రార్థనలు చేసే సంప్రదాయం వంద సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది.
ఈ క్రమంలో సాయి బాబాకు రోజులో నాలుగు సార్లు అర్చకులు హారతి ఇస్తారు. ఉదయం 5.15 గంటలకు కాకడ్ హారతి ఘట్టం ప్రారంభం అవుతుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు అనేక మంది భక్తులు వేకువజామునుంచే ఆలయంలో ఎదురుచూస్తారు. అయితే, బుధవారం మాత్రం కాస్త భిన్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఆలయంలోని లౌడ్ స్పీకర్లను రాత్రి నుంచి మూసివేశారు అధికారులు.
‘పోలీసుల నుంచి మాకు ఓ లేఖ అందింది. లౌడ్స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వారు ప్రస్తావించారు. వాటిని అనుసరించి ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి’ అని వివరించారు షిర్డీ సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి భాగ్యశ్రీ బనాయత్. షిర్డీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గులాబ్రావ్ పాటిల్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, ఆ సమయంలో అజాన్ కోసం కూడా లౌడ్స్పీకర్లను వినియోగించలేదని స్పష్టం చేశారు.
అయితే,, లౌడ్స్పీకర్లు లేకుండా కాకడ్ హారతి నిర్వహించడంపై షిర్డీలోని జమా మసీద్ ట్రస్ట్, స్థానిక ఇస్లాం పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఏళ్లుగా ఉన్న పద్ధతిని అలానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బాబా ఆలయం.. షిర్డీకి అంతర్జాతీయంగా ఖ్యాతిని తెచ్చిందని, మతసామరస్యానికి ప్రతీకని అన్నారు.
ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలతో మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అదే సమయంలో లౌడ్స్పీకర్ల వినియోగంపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. చర్చనీయాంశమయ్యాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పక్కాగా అమలయ్యేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లు ఉపయోగించరాదన్నది సుప్రీం మార్గదర్శకాల్లో ఒకటి.