• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఏం మాయ చేస్తాడో కానీ..

Published on : October 5, 2019 at 7:51 am

జగన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కథ ఏంటి..? ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ దగ్గర వున్న మంత్రం ఏంటి..? తనపై విమర్శల్ని ఎక్కుపెట్టిన స్టేట్ బీజేపీ లీడర్ల నోళ్లు మూయించే మాస్టర్ ‌ప్లాన్ ఏంటి?

AP ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి డిల్లీ టూరులో ఓ ఆసక్తికరమైన మేటర్ ఉంది. ఢిల్లీ పెద్దలను కూల్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్‌ సిద్ధం చేశారని సమాచారం ఉంది. ప్రధానితో సమావేశం సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి జగన్ ప్రస్తావిస్తారు. విద్యుత్ పీపీఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వంటి ముఖ్యమైన అంశాలు ఎటూ ప్రస్తావనకు రానున్నాయి. అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తోన్న జగన్.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.12,500 అందజేస్తుండగా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నుంచి వచ్చే రూ.6 వేలను కూడా అందులో కలుపుతారు. దీంతో ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలని జగన్‌ను రాష్ట్ర బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

గతంలో చంద్రబాబు ఇలాగే కేంద్రం నిధులిచ్చిన పథకాలకు తన పేరు పెట్టుకున్నారని మోదీ, అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు విమర్శించారు. స్టిక్కర్ సీఎం అంటూ బాబును విమర్శించారు. ఇప్పుడు బీజేపీ తనపై కూడా అలాంటి విమర్శలే ఎక్కుపెట్టే అవకాశం ఉండటంతో జగన్ అప్రమత్తం అయ్యారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు.. రెండు విధాలుగా ప్రయోజనం కలిగేలా ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. దాన్ని పీఎం ముందు వుంచబోతున్నారు.

ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రైతు భరోసా పథకానికి ప్రధాని మోదీ పేరు కూడా జత చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని మోదీకి చెప్పి, పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయన కోరనున్నారని తెలుస్తోంది. జగన్ ప్రతిపాదనకు మోదీ ఓకే చెబితే.. బీజేపీ నేతలు ఈ విషయంలో జగన్‌ను విమర్శించడానికి ఛాన్స్ ఉండదు.

వైఎస్ఆర్ భరోసాకు మోదీ పేరును జత చేయడం ద్వారా తనకు, చంద్రబాబుకు ఎంతో తేడా ఉందని జగన్ పరోక్షంగా చెప్పినట్టే. అటు టీడీపీ నేతలపై విమర్శలు చేయడంతో పాటు, ఇటు బీజేపీ నేతల నోళ్లు మూయించడానికి జగన్ నిర్ణయం ఉపకరిస్తుంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ మోదీ రైతు భరోసా అని ఈ పథకానికి పేరు పెట్టాలని భావిస్తున్నారట. ప్రధాని మోదీతో భేటీ తర్వాత పేరు ఫైనలయ్యే అవకాశాలున్నాయి.

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సోను సూద్ టైలర్ గా మారిన వేళ !!

సోను సూద్ టైలర్ గా మారిన వేళ !!

ఓటీటీ లో క్రాక్ ?

ఓటీటీ లో క్రాక్ ?

బిబి3 లో అఖిల్ హీరోయిన్ ఫిక్స్

బిబి3 లో అఖిల్ హీరోయిన్ ఫిక్స్

అఖిల్ స‌క్సెస్ కోసం స‌మంతా ఆరాటం

అఖిల్ స‌క్సెస్ కోసం స‌మంతా ఆరాటం

ప్ర‌భాస్ స‌లార్ మూవీ అప్డేట్స్

ప్ర‌భాస్ స‌లార్ మూవీ అప్డేట్స్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీలో రెండు వేల లోపు క‌రోనా యాక్టివ్ కేసులు

ఏపీలో రెండు వేల లోపు క‌రోనా యాక్టివ్ కేసులు

తొలివెలుగు - Latest Telugu Breaking News - Live Telangana & AP Telugu News

వికారాబాద్ అడ‌వుల్లో బుల్లెట్ క‌ల‌క‌లం

సంగారెడ్డిలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వ‌ర్క‌ర్ కు అస్వ‌స్థ‌త‌

సంగారెడ్డిలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వ‌ర్క‌ర్ కు అస్వ‌స్థ‌త‌

కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఆపి డీపీఆర్ లు ఇవ్వండి- సీఎంల‌కు కేంద్రం లేఖ‌

కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఆపి డీపీఆర్ లు ఇవ్వండి- సీఎంల‌కు కేంద్రం లేఖ‌

GHMC Election Results LIVE Updates 2020

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కొత్త మేయ‌ర్ ఎన్నిక‌కు ముహుర్తం ఫిక్స్

విజ‌య‌వాడ‌లో టీకా తీసుకున్న హెల్త్ వ‌ర్కర్ కు అస్వ‌స్థ‌త‌

విజ‌య‌వాడ‌లో టీకా తీసుకున్న హెల్త్ వ‌ర్కర్ కు అస్వ‌స్థ‌త‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)