పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యపై పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ లు ఆందోళనలు చేపట్టాయి. మాన్ సర్కార్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. పంజాబ్ లో పప్పెట్ ప్రభుత్వం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సెన్సిటివిటీ సీఎంలు భగవంత్ కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లకు తెలియదని.. ప్రభుత్వాన్ని తక్షణమే డిస్మిస్ చేయాలని పంజాబ్ బీజేపీ చీఫ్ గవర్నర్ తో భేటీలో కోరారు.
మూస్ వాలా భధ్రతను ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. ఈ హత్యను రాజకీయ హత్యగా భావించి.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం ఎదుట నిరసనకారులు బైఠాయించారు. జస్టిస్ ఫర్ మూసేవాలా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు సిద్ధూ అభిమానులు.
మూసేవాలా తండ్రి బాల్ కౌర్ సింగ్.. తన కుమారుడి మృతిపై సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కు లేఖ రాశారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో కోరారు. మరోవైపు.. మూసేవాల ప్రయాణించిన వాహనం నుంచి ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించారు.
ఇాదిలా ఉంటే..మూసేవాలాను చంపిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ లో సింగర్ వాహనం వెనుక మరో రెండు వాహనాలు ఫాలో చేసినట్లు గుర్తించారు. మూసేవాలా కారుపై 46 రౌండ్ల కాల్పులు జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది.