ప్రమఖ సింగర్ చిన్మయి శ్రీపాద తల్లయ్యింది. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఆ ఆనంద క్షణాలను తన భర్తతో కలిసి అభిమానులతో షేర్ చేసుకుంది చిన్మయి. చిన్మయి కవలలకు జన్మనిచ్చిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా భర్త రాహుల్ రవీంద్ర తెలియజేశారు. చిన్నారుల చిట్టి చేతులను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
”మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన అతిధులు ‘ద్రిప్తా మరియు శర్వాస్’ జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిధులు” అని రాసుకొచ్చారు రవీంద్ర. ఈ అందమైన ప్రపంచంలో మేము ఇద్దరం మాకిద్దరు అంటూ చిన్నారుల చిట్టి చేతుల ఫోటోలకు ట్యాగ్ చేసి రాశారు రవీంద్ర.
చిన్మయి, రాహుల్ మే 2014లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో చిన్మయి ఒకరు. గురు, చెన్నై ఎక్స్ప్రెస్, తమిళ చిత్రాలు 96, కన్నతిల్ ముత్తమిట్టల్, మరియన్, ఏం మాయ చేశావే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మజిలీ వంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఆమె పాటలు పాడారు.
ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ సమంతకు ఆమె డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఇక రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే నటుడిగా, డైరెక్టర్ గా విభిన్న కోణాలు ప్రదర్శిస్తారు. రీసెంట్ గా ఆయన నటించిన నానీ చిత్రం శ్యాం సింగరాయ్ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. రవీంద్ర దర్శకత్వం వహించిన చిలసౌ హిట్ టాక్ తెచ్చుకుంది.