బాలు పోగానే తెలుగు పాట చీకటైపోయిందన్నారు ప్రముఖ గాయని పీ సుశీల. బాలసుబ్రహ్మణ్యం అంటే సుశీలమ్మకి ఎంతో అభిమానం. సుశీలమ్మ, బాలసుబ్రహ్మణ్యం కలిసి ఎన్నో పాటలను పాడారు. తాజాగా సుశీల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నేను, బాలు కలిసి ఒక రికార్డింగ్ థియేటర్ నుంచి మరో రికార్డింగ్ థియేటర్ కు పరుగులు పెడుతూ ఉండేవాళ్లమన్నారు.
మహాత్ముడు బాలు ఎక్కడ ఉన్నా.. ఆయన ఆత్మ శాంతించాలన్నారు. ఆయన పోయిన తరువాత ఫిల్మ్ ఫీల్డ్ చీకటైపోయిందన్నారు. అది ఆయన ప్రత్యేకత అన్నారు. ఇంతవరకూ ఎన్నో వేల పాటలు పాడాను.. పాడటం ఎప్పుడూ అలసటగా అనిపించలేదన్నారు.
ఘంటసాల గారు మా ఊళ్లోనే చదువుకున్నారు. కానీ నేను ఆయనను అక్కడ చూడలేదు. మద్రాసు వచ్చిన తరువాతనే ఏవీఎమ్ స్టూడియోలో చూశాను. ఆయనతో కలిసి ‘భూ కైలాస్’ సినిమా కోసం మొదటి పాట పాడానని చెప్పారు.
ఒక వైపున పులిలా ముందు ఘంటసాల గారు .. మరో మైకు ముందు నేను. ఆ రోజులను తలచుకుంటే ఎలా పాడానా అనిపిస్తుంది. నా కెరియర్ గురించి చెప్పుకోవాలంటే ‘లవ కుశ’, ‘భక్త ప్రహ్లాద’ ఈ రెండు సినిమాలు చాలని తెలిపారు సుశీల.