• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » కాంగ్రెస్ నేతలకు హైకోర్టు సమన్లు.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం

కాంగ్రెస్ నేతలకు హైకోర్టు సమన్లు.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం

Last Updated: July 29, 2022 at 5:35 pm

కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాకు హైకోర్టు శుక్రవారం సమన్లు పంపింది.

గోవాలో స్మృతి ఇరానీ కూతురు అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి భర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్మృతి ఇరానీతో పాటు ఆమె కూతురుపై ఆరోపణలకు సంబంధించి చేసిన ట్వీట్లను, పోస్టులు, ఫోటోలు, వీడియోలను 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇచ్చిన గడువులోగా ముగ్గురు కాంగ్రెస్ నేతలు వీటిని తొలగించాలని, లేనిపక్షంలో ట్విట్టర్, యూట్యూబ్ లు వీటిని తొలగిస్తాయని హైకోర్టు పేర్కొంది. తన కూతురుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై స్మృతి ఇరానీ రూ.2 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు.

కేంద్ర మంత్రి దాఖలు చేసిన వ్యాజ్యంపై సమధానం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో వాస్తవాలను కోర్టు ముందు ఉంచేందుకు తాము ఎదురు చూస్తున్నామంటూ కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ ట్వీట్ చేశారు.

మరోవైపు ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యల వివాదంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని స్మృతి ఇరాని విమర్శించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. ఈ విషయంలో సోనియాకు స్మృతీ ఇరానీ క్షమాపణలు చెప్పాల్సిందే అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. స్మృతి ఇరానీని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు.

Primary Sidebar

తాజా వార్తలు

టికెట్‌ టెన్షన్‌.. కాంగ్రెస్‌ మల్లగుల్లాలు

కాంగ్రెస్ లో కలకలం.. పాల్వాయి స్రవంతి ఆడియో లీక్

వృద్దులు రాత్రి సమయాల్లో ఎందుకు ఎక్కువగా మరణిస్తారు…?

ఆల్కాహాల్ తాగే వారు బరువు ఎందుకు పెరుగుతారు…?

ఈడీ లిస్ట్..టార్గెట్ 19 !

హజరుకాని మంత్రి.. నాంపల్లి కోర్టుకు బదిలీ!

ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త.. !

రాక్షసులు శివుడ్ని ఎందుకు పూజించేవారు…?

అది ఒరిజినల్ వీడియో కాదు… క్లారిటీ ఇచ్చిన ఎస్పీ..!

ఆడవారికి గుండెపోటు ఎందుకు తక్కువ…?

బ్లాక్ మ్యాజిక్ ద్వారా ప్రజల మద్దతు పొందలేరు..!

పెళ్ళిలో బాసికం ఎందుకు కడతారు…?

ఫిల్మ్ నగర్

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

బ్లాక్ పింక్ వారి బోర్న్ పింక్ వ‌చ్చేస్తోంది!!

బ్లాక్ పింక్ వారి బోర్న్ పింక్ వ‌చ్చేస్తోంది!!

జ‌ర జాగ్ర‌త్త‌గా మాట్లాడండి!!

జ‌ర జాగ్ర‌త్త‌గా మాట్లాడండి!!

వాటి నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నా!!

వాటి నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నా!!

ట్రేడ్ టాక్.. బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన బింబి

ట్రేడ్ టాక్.. బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన బింబి

ఐశ్వర్య రాయ్ పై బన్సాలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఐశ్వర్య రాయ్ పై బన్సాలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)