కౌన్సిలర్ అధికార దర్పానికి ఓ ఆర్మీజవాను మృతిచెందాడు.దారుణమైన ఈ సంఘటన తమిళనాడులో కృష్ణగిరి జిల్లా పోచంపల్లిలో జరిగింది. డీఎంకే కౌన్సిలర్ దాడిలో సైనికుడు మరణించగా.. అతని సోదరుడు గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. జవాన్ ప్రభు(29) అతని సోదరుడు ప్రభాకరణ్ పబ్లిక్ ట్యాంక్ వద్ద బట్టలు ఉతుకుతుండగా డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామితో వాగ్వాదం జరిగింది. అయితే అదే రోజు కౌన్సిలర్ మరి కొంతమందితో కలిసి ఆర్మీ జవాన్ ఇంటికి వెళ్లి సోదరులిద్దరిపై దాడి చేశాడు.
ఈ దాడిలో సోదరులిద్దరికి గాయలవ్వగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జవాన్ ప్రభు ఆరోజు రాత్రి మరణించాడు. ప్రస్తుతం అతని సోదరుడు ప్రభాకరణ్ చికిత్స పొందుతున్నాడు.
ఘటనకు సంబంధించిన ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డీఎంకే కౌన్సిలర్ సహా అతని సోదరులు, బంధువులు ఉన్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోహరన్ చెప్పారు.