• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » ఇంటికొచ్చి విచారించాలి.. కవిత లేఖలో ఏముంది..?

ఇంటికొచ్చి విచారించాలి.. కవిత లేఖలో ఏముంది..?

Last Updated: March 16, 2023 at 1:52 pm

కవిత ఈడీ విచారణలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని.. విచారణకు రాలేనని కవిత స్పష్టం చేశారు. అయితే.. ఈడీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. విచారణకు రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ సందర్భంగా కవిత ఈడీకి పంపిన లేఖపై చర్చ సాగుతోంది.

soma bharat on ed inquiry

కవిత పంపిన లేఖలోని అంశాలు

తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు కవిత. సుప్రీం నిర్ణయం తర్వాతే విచారణకు వస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లలో లేదని.. అందుకే లాయర్ తో మీరు అడిగిన డాక్యుమెంట్స్ పంపించానని ఈడీకి తెలిపారు. అలాగే, సమన్లలో తన ఫోన్ సీజ్ చేసినట్టు ప్రస్తావించలేదని అన్నారు కవిత.

ఈడీ ఆఫీస్ దగ్గర కవిత లాయర్ ఏమన్నారంటే?

కవిత తరఫున ఈడీ ఆఫీస్ కు సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గత విచారణలో ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని అన్నారు. సెల్ ఫోన్ బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 15 కింద మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలను ఇంటికొచ్చి విచారించాల్సి ఉందని.. అదే విధంగా సాయంత్రం ఆరు గంటలలోపు విచారణ పూర్తి చేయాలని.. గత విచారణలో రాత్రి 8.30 గంటల వరకు ఆఫీసులోనే ఉంచడం ఏంటని ప్రశ్నించారు. ఈడీ అధికారుల విచారణ తీరు బాగోలేదన్న లాయర్.. మహిళగా కవితకు ఉన్న హక్కులను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.

కవిత తరఫున ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు సోమా భరత్. ఈడీ కోరిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్టు తెలిపారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందని గుర్తు చేశారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు. ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని.. ఈడీ ఎలాంటి నోటీసు, డేట్స్ ఇవ్వలేదని వెల్లడించారు.

Primary Sidebar

తాజా వార్తలు

భారంగా మారిన వైద్యు ఖర్చులు.. యువకుడి బలవన్మరణం..!

పేపర్ల లీకేజీ కేసులో 42 మందికి సిట్ నోటీసులు

ఈడీ విచారణ తర్వాత.. కవిత కౌంటర్ వీడియో!

కొడుకు పెళ్ళి కోసం యజమాని ఇంటికి కన్నం…!

గురుద్వారాలో చొరబడి.. అమృత్ పాల్ ‘విలనిజం’ !

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ సంచలన నిర్ణయం

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసారానికి ఏర్పాట్లు..!

పెరుగుతున్న కరోనా కేసులు.. మోడీ సమీక్ష

కేసీఆర్ తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ!

సమస్యలు పట్టించుకోకుండా గాలికి తిరుగుతున్నాడు!!

ఈ ఏడాది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా కీలకం!

పలు అంశాలకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్..!

ఫిల్మ్ నగర్

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap