• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » సోమేశ్ కుమార్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

సోమేశ్ కుమార్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

Last Updated: January 12, 2023 at 6:11 pm

తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలకు కసరత్తు జరుగుతుంది. గతంలోనే దీనికి సంబంధించి కొంత కసరత్తు చేసిన సర్కార్ తాజాగా సీఎస్ మార్పు నేపథ్యంలో మార్పులు,చేర్పులు అనివార్యమని భావిస్తోంది. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు సహా సీనియర్ అధికారుల వరకు పోస్టింగుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్ బదిలీలుంటాయని చర్చ జరుగుతోంది. అయితే హైకోర్టు తీర్పు,డీఓపీటీ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్ రిలీవ్ అయ్యి ఏపీ కేడర్ కు వెళ్లారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతి కుమారిని, రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ గా నియమించగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఐఏఎస్ పోస్టింగుల్లో మార్పులు,చేర్పులు అనివార్యమైంది.

సోమేశ్ కుమార్, సీఎస్ పదవితో పాటు రెవెన్యూ,వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ , గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా,సీసీఎల్ఏ, రెరా ఛైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆ శాఖలు, బాధ్యతలు ఖాళీగా ఉన్నాయి. నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన శాంతి కుమారి ఇప్పటి వరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ శాఖ ప్రస్తుతం ఖాళీ అయింది.

అయితే ఇప్పటికే పలు శాఖలకు పూర్తి స్థాయి కార్యదర్శలు లేకపోవడంతో అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని కొందరు అధికారులు కోరుతున్నారు. మాణిక్ రాజ్, రజత్ కుమార్ , షైనీ, ప్రీతిమీనా తదితరులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్తున్నారు. దీంతో వారు ఇప్పటి వరకు నిర్వరిస్తున్న బాధ్యతల్లో మరొకరిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పలువురు అధికారులు దీర్ఘకాలంగా ఒకే బాధ్యతల్లో ఉన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎక్కువ రోజులుగా ఉన్నారు. హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లు కాకుండా ఇన్ ఛార్జులే ఉన్నారు. వీటిన్నింటి దృష్ట్యా తెలంగాణలో ఐఏఎస్ ల పోస్టింగుల్లో మార్పులు,చేర్పులు అనివార్యమయ్యాయి.

Primary Sidebar

తాజా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ రిప్లై…!

కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..!

ముగిసిన జమున అంత్యక్రియలు

అందుకే తేజస్వీ యాదవ్‌ను సీఎంగా నితీశ్ ఎంచుకున్నారు…!

ఖమ్మం కయ్యం.. కౌంటర్ ఎటాక్స్ తో హీట్ 

ఫిల్మ్ నగర్

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap