ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలన్నారు సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సోమిరెడ్డి. ఏబీఎన్, టీవీ5 ప్రసారాలను నిలిపివేయడం, వాటితో పాటు ఈటీవీకి అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం కక్ష సాధింపు చర్యకాకపోతే మరేంటని ప్రశ్నించారు.
వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే అనుమతి ఇవ్వనట్టు కనిపిస్తోందన్నారు సొమ్మిరెడ్డి. నిషేధం విధించినంత మాత్రాన నిజాలను బయటకు రాకుండా ప్రభుత్వం ఆపలేదని అన్నారు. గత ఐదేళ్లలో సాక్షి బరితెగించి రాతలు రాసిందని, ఇప్పుడు సాక్షి రాసేది తప్పులని సీఎం జగన్ సెలవిస్తున్నారని సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.