• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఆనాడు ఒప్పుకున్నది మీరే కదా – సోమిరెడ్డి

Published on : August 1, 2020 at 2:05 pm

ఏపీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదంపై మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని బీడు పెట్టాలనుకోవడం, గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గమన్నారు.
2014 ఎన్నికల్లో ప్రజాతీర్పు మేరకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. నిండు శాసనసభలో సభానాయకుడు, సీఎంగా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి రాజధానిగా అమరావతిని ఆమోదించారు. అమరావతికి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ సభ్యులు కూడా మద్దతు పలికారు. శాసనమండలిలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు అమరావతికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఇవన్నీ జరిగాక సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అమరావతి మరో ఢిల్లీ కావాలని మోదీ ఆశీర్వదించారు. ఇంతమంది చెప్పాక నమ్మి 30 వేల మంది రైతులు చరిత్రలో నిలిచిపోయేలా 34 వేల ఎకరాలు త్యాగం చేయడం తప్పా. మంచి రాజధాని వస్తుందని ఉజ్వల భవిత ఉంటుందని నమ్మి వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులది తప్పా. పది వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన భవనాలను శిథిలాలుగా మార్చేస్తారా.ఇప్పటికే హౌసింగ్ ఫర్ ఆల్ కింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించిన 6 లక్షల ఇళ్లను పేదలకు చెందనీయకుండా బీడు పెట్టేశారు.కక్ష సాధింపులు పేదలపై చూపడం తగదు.

బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కూడా బాధాకరం. అసెంబ్లీ, శాసనమండలిలో మీరు ఆమోదించి, ప్రధాన మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని ఇదని మరిచిపోకండి. ఓ వైపు అమరావతికి మద్దతు అంటారు..ఇంకో మూడు రాజధానులు ప్రభుత్వ ఇష్టమంటారు. ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కుంగిపోతుంటే..మరో వైపు ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా స్పందించరా.ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశమంతా గమనిస్తోంది. నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియమాకం విషయంలో జరిగిన అనేక పరిణామాలను కూడా చూశాం. రాజధాని విషయంలోనూ కోర్టుకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలున్నాయి…కానీ మీరు తీసేసుకుంటూ ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. వెయ్యో, రెండు వేల కోట్లు ఖర్చుపెడితే పూర్తయ్యే రాజధానిని మార్చడం దురదృష్టకరం. రాజధాని విషయంలో మీ నిర్ణయం తప్పు…ప్రజాగ్రహానికి గురికాకతప్పదు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా రాజధాని మార్చొద్చు..కావాలంటే రెఫరెండం కోరండని పేర్కొన్నారు.

tolivelugu app download

Filed Under: రాజకీయాలు

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

జగ్గూభాయ్ పోస్ట్ వెనుకున్న అర్థం ఏమిటో ?

జగ్గూభాయ్ పోస్ట్ వెనుకున్న అర్థం ఏమిటో ?

అభిమాని పెళ్లిలో స్టార్ హీరో సూర్య

అభిమాని పెళ్లిలో స్టార్ హీరో సూర్య

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

స‌ర్పంచ్ ల కోసం సెక్రెట‌రీల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్న కేసీఆర్ స‌ర్కార్...?

స‌ర్పంచ్ ల కోసం సెక్రెట‌రీల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్న కేసీఆర్ స‌ర్కార్…?

రైతుల ర్యాలీలో ఉద్రిక్త‌త‌- టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగిస్తున్న పోలీసులు

రైతుల ర్యాలీలో ఉద్రిక్త‌త‌- టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగిస్తున్న పోలీసులు

father mother

కూతుళ్ల‌ను చంపిన కేసులో ట్విస్ట్- త‌ల్లితండ్రులు న‌గ్నంగా…

ఎన్నిక‌ల సంఘంతో మైండ్ గేమ్ మొద‌లుపెట్టిన జ‌గ‌న్ స‌ర్కార్

ఎన్నిక‌ల సంఘంతో మైండ్ గేమ్ మొద‌లుపెట్టిన జ‌గ‌న్ స‌ర్కార్

తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా వెరస్

తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా వెరస్

BREAKING...దేశంలో భారీగా దిగొచ్చిన క‌రోనా కేసులు

BREAKING…దేశంలో భారీగా దిగొచ్చిన క‌రోనా కేసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)