సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
తెలంగాణలో జిల్లాల విభజన విఫలమైంది. అదే ఐడియాను ఏపీలో అమలు చేయాలనుకోవడం తప్పిదమే అవుతుంది. కేసీఆర్ ను చూసి కాపీ కొట్టాలనుకుంటే రైతుబంధు లాంటి పథకాలు కాపీ కొట్టండి. కానీ, జిల్లాల విభజన తగదు.
ఆనం రామనారాయణరెడ్డి సహా వైసీపీ నేతలే జిల్లాల విభజనను తప్పుబడుతున్నారు. పార్లమెంట్ పరిధిని జిల్లాలుగా విభజించటం అనాలోచిత నిర్ణయం. పార్లమెంట్ పరిధికి జిల్లా ఏర్పాటుకు సంబంధం లేదు.
2026లో దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు సరిహద్దులు మారతాయి. మళ్లీ జిల్లాలను మారుస్తారా?. దేశంలో ఏ శాఖలో కూడా పార్లమెంట్ పరిధి ఆధారంగా పరిపాలన జరగదు.
పార్లమెంట్ సరిహద్దులను పక్కన పెట్టి జిల్లాల విభజన చేయాలి. ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో 124 అసెంబ్లీ స్థానాలున్నాయి. కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పదిలోపే ఉన్నాయి. వాటిని విభజించడం తగదు.