సోము వీర్రాజు,
బీజేపీ నేత.
నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ నేతలపై పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పేందుకు వెళ్తే పోలీసులు బీజేపీ నేతలపై వ్యవహరించిన తీరు చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నట్లుగా కనపడుతోంది.సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఒక్కసారిగా పోలీసులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తో సహా పలువురు బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారు.
గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారు అన్న విషయం పోలీసులు చెప్పడం లేదు.ప్రజాస్వామ్యంలో ఉన్నామా నిరంకుశ రాచరిక వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. పోలీసులు బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలి లేదంటే బీజేపీ తన కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలో ఆవిధంగా రక్షించుకునే ప్రయత్నం చేస్తోంది.
బీజేపీ నేతలందరినీ బేషరతుగా విడుదల చేయాలి ప్రజాస్వామ్యవ్యవస్ధలో ప్రభుత్వానికి సమస్యలు చెబుతాం. ఆ దిశగానే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేల అరచాకాలు తెలియ చేయడానికి వెడితే ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సురేష్ ను పోలీసులు బూటుకాళ్లతో తన్నిన సంఘటన చూస్తే రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తున్నట్లుగా ఉంది. బీజేపీ నేతలను బూటు కాళ్ళతో తన్నిన పోలీసులు పై కేసు నమోదు చేయాలి.