పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతోందని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం అంశాన్ని ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లేనని వ్యాఖ్యానించారు. పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే అని, పోలవరం గురించి ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లే అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని, రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలి. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారు. విభజన తరవాత భద్రాచలం టెంపుల్ ను, మరో రెండు మండలాలు తెలంగాణ కు ఇచ్చారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు నీరు ఇవ్వాలని వైఎస్ పనులు చేపట్టారు. దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని సోము వీర్రాజు వెల్లడించారు.
పోలవరం ముంపు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణ కలుస్తామంటున్నారని.. వారంతా భద్రాచలం మీద ఆధార పడటం వల్ల అటు చూస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. విలీనం చేసిన మండలాల్లో సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి..? ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడి రోడ్డెక్కారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా..? చంద్రబాబు పోలవరం సోమవారం అని ఆర్భాటం చేశారు… పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బతిన్నారని.. చంద్రబాబు పెద్దఎత్తున అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. మూడేళ్లలో వాటిని బయటపెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు..? లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయం పై అధ్యయనం జరుగుతుందని.. రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదన్నారు.