• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » పోలవరం విషయంలో కుట్ర జరుగుతోంది : సోము వీర్రాజు

పోలవరం విషయంలో కుట్ర జరుగుతోంది : సోము వీర్రాజు

Last Updated: July 21, 2022 at 1:39 pm

పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోందని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం అంశాన్ని ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లేనని వ్యాఖ్యానించారు. పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే అని, పోలవరం గురించి ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లే అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని, రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలి. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారు. విభజన తరవాత భద్రాచలం టెంపుల్ ను‌, మరో రెండు మండలాలు‌ తెలంగాణ కు ఇచ్చారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు‌ నీరు ఇవ్వాలని‌ వైఎస్ పనులు చేపట్టారు. దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని సోము వీర్రాజు వెల్లడించారు.

పోలవరం ముంపు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణ కలుస్తామంటున్నారని.. వారంతా భద్రాచలం మీద ఆధార పడటం‌ వల్ల అటు చూస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. విలీనం చేసిన మండలాల్లో‌ సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి..? ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడి రోడ్డెక్కారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా..? చంద్రబాబు పోలవరం సోమవారం అని ఆర్భాటం చేశారు… పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బతిన్నారని.. చంద్రబాబు పెద్దఎత్తున అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారని సోము వీర్రాజు ఫైర్‌ అయ్యారు. మూడేళ్లలో వాటిని బయటపెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు..? లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయం పై అధ్యయనం జరుగుతుందని.. రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్ అయ్యారు. పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

నారాయణ.. ఫీ‘జులుం’.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఆరున్నర గంటల హైడ్రామా.. ఈ పోరాటం ఫలించేనా?

నవగ్రహాలకు ప్రదిక్షణ చేస్తే కాళ్ళు కడగాలా…?

తీవ్ర వాయు‘గండం’

రాత్రి సమయంలో బట్టలు ఎందుకు ఉతకకూడదు…?

బీరు ఎక్కువ తాగితే ముసలితనం వస్తుందా…?

పంచదార శుద్ది కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి..!

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్…!

మరోసారి ప్రత్యక్షమైన … సాలు దొర.. సెలవు దొర… డిజిటల్ బోర్డు..!

సిసోడియాపై ఎఫ్ఐఆర్

బాధలు చెప్పుకోవడానికి వేదిక ఏది? హనుమంతరావు

సమస్య పరిష్కరించకపోతే ఇక్కడే చనిపోతాం: భూ నిర్వాసితులు

ఫిల్మ్ నగర్

చోళ చోళ... పీఎస్ 1 సెకండ్ సింగిల్!

చోళ చోళ… పీఎస్ 1 సెకండ్ సింగిల్!

కార్తికేయ 2 మూవీకి బిగ్ బీ ఫిదా!

కార్తికేయ 2 మూవీకి బిగ్ బీ ఫిదా!

రణ్ బీర్ ను ఆడుకుంటున్న అలియా ఫ్యాన్స్

రణ్ బీర్ ను ఆడుకుంటున్న అలియా ఫ్యాన్స్

సామ్ ఎందుకింత సైలెంట్ అయింది....!

సామ్ ఎందుకింత సైలెంట్ అయింది….!

ఇక బేబమ్మ పని అయిపోయినట్టేనా? ..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ఇక బేబమ్మ పని అయిపోయినట్టేనా? ..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది... హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు...!

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది… హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)