సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావన లేదన్న జగన్.. రాష్ట్ర బడ్జెట్ ను ప్రాంతాల వారీగా ఎందుకు చూపలేదు. అసలు.. బడ్జెట్ లో ఏ ప్రాంత అభివృద్ధి గురించి అయినా ప్రస్తావించారా? ఇది మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్.
రాష్ట్రంలో రెవెన్యూ లోటు 5వేల కోట్లకు చేరడం గమనించాల్సిన విషయం. బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోంది. జగన్ ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారో చెప్పాలి. అప్పులు ఎగ్గొట్టడానికా. బడ్జెట్ లో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదు.
వైసీపీ పాలన అప్పులతోనే సాగుతోంది. ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు ఎన్నిసార్లు అడుగుతున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా వాటి వివరాలను ప్రజల ముందు పెట్టాలి.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ ఎక్కడా అమలు చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ జెండా ఎగడం ఖాయం. కేంద్ర బడ్జెట్ లో అందరికీ నిధులిచ్చాం. 64వేల కోట్లతో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టాం.