వికారాబాద్ జిల్లా పరిగి మండలం కుదావంద్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లినే చంపేశాడు కసాయి కొడుకు బలవంత్. తల్లి భీమమ్మ వయసు 55 ఏళ్ళు. రైతు బంధు,వితంతు పెన్షన్ కోసం నిత్యం తల్లితో గొడవ పడే వాడు బలవంత్. అలాగే నిన్న రాత్రి కూడా పెస్షన్ డబ్బుల కోసం తల్లితో గొడవ పడ్డాడు. చంపేస్తే రైతు భీమా వస్తుందని భావించి హత్య చేశాడు.
తనే హత్యచేసి తల్లిని ఎవరో చంపారంటూ స్థానికులను కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. మద్యం సేవించి జులాయి గా తిరుగుతూ… నిత్యం తల్లితో గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.