CBSE టెన్త్ ఇంగ్లీష్ పరీక్షలో మహిళలకు స్వేచ్ఛనిస్తే చిన్నారులపై తల్లిదండ్రులు ఆధిపత్యం కోల్పోతారు అనే వాక్యం ఉండడంపై కాంగ్రెస్ పార్టీ విస్మయం వ్యక్తం చేసింది. ఇది మహిళను కించపరచడమేనని లోక్ సభలో వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. తక్షణమే మోడీ ప్రభుత్వం మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారామె.
ఇక భర్త మార్గంలో నడుచుకోవడం ద్వారానే తల్లి వయోజనులైన పిల్లల విధేయతను పొందగలదు అని ఉన్న మరో వాక్యంపైనా అభ్యంతరం తెలిపారు సోనియా. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో డీఎంకే, ఐయూఎంఎల్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
Most #CBSE papers so far were too difficult and the comprehension passage in the English paper was downright disgusting.
Typical RSS-BJP ploys to crush the morale and future of the youth.
Kids, do your best.
Hard work pays. Bigotry doesn’t.— Rahul Gandhi (@RahulGandhi) December 13, 2021
Advertisements
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. యువత భవిష్యత్ ను వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇది లింగ అసమానతలను ప్రేరేపించేలా ఉందని అభివర్ణించారు ప్రియాంక గాంధీ.