ప్రగతిభవన్ ను పేల్చివేయాలని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా.. రాష్ట్ర అధ్యక్షులు అలా మాట్లాడొచ్చా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మీ పార్టీ అధ్యక్షుడుకి మీకు శృతి ఉందా.. అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
సీఎం ఎవరైతే వాళ్లు ప్రగతి భవన్ లో ఉంటారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఇది తేసేయాలి.. అది పేల్చాలి.. తప్ప ఇంకేమైనా మంచి మాట్లాడతారా.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ని బద్దలు కొడతా అని అనొచ్చా.. అంటూ ప్రశ్నించారు. పేల్చేయండి అనొచ్చా.. అని మండిపడ్డారు.
ఇదేనా కాంగ్రెస్ విధానం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ధరణి రద్దు చేస్తా అని..పీసీసీ చెప్తారు. ఇక్కడేమో.. రద్దు చేయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు. శ్రీధర్ బాబు మంచోడే… కానీ సహవాస దోషం ఏమో.. అని ఎద్దేవా చేశారు. శ్రీధర్ అన్న, భట్టి అన్న మంచోళ్లు అంటూ మంత్రి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఆ పార్టీ నేతలు బయట అరాచకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల పార్టీ అధ్యక్షుడు రైటు టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను.. రైట్ టు ఇన్కమ్ యాక్ట్ గా మార్చుకున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్టీఐ పేరు మీద అడ్డగోలుగా దందాలు చేస్తారని ఆరోపించారు. హైదరాబాద్ రంగారెడ్డి భూముల పైన వాళ్ల పార్టీ అధ్యక్షుడు ఒక దఫ్తర్ నడుపుతున్నారని మంత్రి తీవ్రంగా ఆరోపణలు గుప్పించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర మంత్రి పై కేటీఆర్ విరుచుకుపడ్డారు.