ఆదివారం కావడంతో తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 24 వేల 139 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 602 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కేసులు 2 లక్షల 64 వేల 128కి చేరాయి. ఇక కరోనా కారణంగా నిన్న ముగ్గురు మృతి చెందారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాలు 1,433కి పెరిగాయి.
కరోనా వైరస్ బారి నుంచి నిన్న 1015 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2 లక్షల 51 వేల 468కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వేల 227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 8 942 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 51.58 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.