తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం కావడంతో యధావిధిగా టెస్టులు తగ్గడంతో కేసులు కూడా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 28 వేల 980 మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 384 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 78వేల 108కు చేరాయి. ఇక కరోనా కారణంగా నిన్న ముగ్గురు మృతి చెందారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాలు 1496కు పెరిగాయి.
కరోనాబారి నుంచి నిన్న 631 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2 లక్షల 69 వేల 232కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,380 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 5,298 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 61.57 లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు