టీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసి 41 ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే ఇవ్వాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలతో పాటు మంత్రి కేటీఆర్ లను కించపరుస్తూ పోస్టులు పెట్టారని సునీల్ కనుగోలుపై ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఆయనకు సబంధించిన కార్యాలయంపై పోలీసులు సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలు సేకరించారు.
ఈ క్రమంలో డిసెంబర్ 30 న విచారణకు హాజరుకావాలంటూ సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది.