మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ముచ్చటగా మూడోసారి సినిమా తీయబోతున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్టేట్ను చిత్ర బృందం ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందించనున్నట్లు ప్రకటించింది మూవీ టీమ్.
ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి చిత్ర ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించింది. మరోవైపు సంగీత దర్శకుడు తమన్ కూడా “తెల్లవారుజాము నుంచే మహేశ్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ ప్రారంభించా” అంటూ పోస్ట్ పెట్టారు.
చిత్రబృందం నుంచి వచ్చిన లేటెస్ట్ అనౌన్స్మెంట్తో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. #SSMB28గా ఇది ప్రచారంలో ఉంది. పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. ఇందులో మహేశ్కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర నిర్మాత ఎస్ రాధా కృష్ణ తెలిపారు. ఈ సినిమాతో మహేశ్- త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మహేశ్ అభిమానులు అంటున్నారు.
ఈ చిత్రం తరువాత మహేశ్ బాబు రాజమౌళి చిత్రంలో నటించనున్నారు.
The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥
The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨
Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad
— Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022
Advertisements