• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఈ భక్తికి ఏ పేరు పెడతారు… ఇంతకన్నా దారుణం ఉందా ?

Published on : January 25, 2021 at 8:26 am

చిత్తూరు జిల్లా మదనపల్లె శివనగర్‌లో దారుణం చోటు చేసుకుంది.ఆధ్యాత్మికత పేరుతో పేగు తెంచుకు పుట్టిన ఇద్దరు కూతుళ్లను అంతమొందించారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే మదనపల్లి చెందిన వి.పురుషోత్తం నాయుడు పద్మజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పురుషోత్తమ నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తుండగా, పద్మజా పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో మాస్టర్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నడుపుతోంది.

వీరిద్దరికీ సాయిదివ్య, అలేఖ్య అనే ఇద్దరు కుమార్తలు ఉన్నారు. క్షుద్రపూజలపై విపరీతమైన నమ్మకమున్నా పురుషోత్తం నాయుడు, పద్మజ లు వారి ఇంటి చుట్టు పక్కల ఎవరిని ఇంటిలోకి రానీకుండా ఎవరితో కలవకుండా వ్యవహరించేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వీరి ఇంటి నుంచి గంటలు మోగినట్లు పెద్ద శబ్దం వచ్షినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సాయంత్రం స్థానికులకు వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం బయటపడింది. చిన్న కుమార్తె అలేఖ్యను మధ్యాహ్నమే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఇనుప ఆయుదంతో తలపై మోదీ హత్య చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం పెద్ద కుమార్తె సాయిదివ్యను పూజ గది లోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి ఇనుప ఆయుధంతో తలపై మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే మదనపల్లె డి ఎస్ పి రవిమనోహర్ ఆచారి సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్నంగా పరిశీలించారు. పురుషోత్తం నాయుడు పద్మజలను విచారించగా వింత సమాధానాలు చెబుతున్నారు. తమ ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయని తమ ఇద్దరు కుమార్తెలు ఉదయానికల్లా తిరిగి లేచి వస్తారని చెబుతున్నారు. ఒక యువతి ఎంబిఎ పూర్తి చేయగా, మరో యువతి రెహమాన్ మ్యూజిక్ ఇన్ స్టి ట్యూట్ లో విద్యార్థిని.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా, హైలైట్స్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

నితిన్ చెక్ మూవీ గురించి ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే...

నితిన్ చెక్ మూవీ గురించి ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే…

మోస‌గాళ్లు ట్రైల‌ర్ రిలీజ్

మోస‌గాళ్లు ట్రైల‌ర్ రిలీజ్

హీరో వైష్ణ‌వ్ తేజ్ రెండో సినిమా డీల్ క్లోజ్

హీరో వైష్ణ‌వ్ తేజ్ రెండో సినిమా డీల్ క్లోజ్

పవర్ ప్లే....రాజ్ తరుణ్ రెడి

పవర్ ప్లే….రాజ్ తరుణ్ రెడి

venkatesh

దృశ్యం-2 మూవీ అప్డేట్స్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

50వేల ఉద్యోగాల భ‌ర్తీ- కేటీఆర్ చెప్పేది నిరుద్యోగులు ముందే ఊహించారా?

50వేల ఉద్యోగాల భ‌ర్తీ- కేటీఆర్ చెప్పేది నిరుద్యోగులు ముందే ఊహించారా?

నీర‌వ్ మోదీకి షాక్.. భార‌త్‌కు అప్ప‌గించేందుకు యూకే కోర్టు ఓకే

నీర‌వ్ మోదీకి షాక్.. భార‌త్‌కు అప్ప‌గించేందుకు యూకే కోర్టు ఓకే

20రోజుల్లో భూవివాదం ఎలా ప‌రిష్క‌రిస్తారో తెలుసుకోవాల‌నుంది-హైకోర్టు

20రోజుల్లో భూవివాదం ఎలా ప‌రిష్క‌రిస్తారో తెలుసుకోవాల‌నుంది-హైకోర్టు

ఉస్మానియా ఆసుపత్రి క‌ట్టే నిర్ణ‌యానికి ఇంకేన్నాళ్లు స‌మ‌యం కావాలి?- హైకోర్టు

ఉస్మానియా ఆసుపత్రి క‌ట్టే నిర్ణ‌యానికి ఇంకేన్నాళ్లు స‌మ‌యం కావాలి?- హైకోర్టు

వైసీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే..!

వైసీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే..!

మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ కేంద్ర‌మంత్రికి జ‌గ‌న్ లేఖ‌

మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ కేంద్ర‌మంత్రికి జ‌గ‌న్ లేఖ‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)