• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ఆ బస్తీ వాసులకు ఊరట.. ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులపై ‘సుప్రీం’ స్టే

ఆ బస్తీ వాసులకు ఊరట.. ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులపై ‘సుప్రీం’ స్టే

Last Updated: January 5, 2023 at 5:32 pm

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ బస్తీ వాసులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. రైల్వే శాఖకు చెందిన ప్రాంతంలోని ఆక్రమణదారులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం గురువారం స్టే ఇచ్చింది. ఒక్కరాత్రిలో 50 వేలమందికి పైగా ప్రజలను ఖాళీ చేయించలేమని పేర్కొంది. ఈ కేసును మానవతా దృక్పథంతో చూడవలసి ఉందని, అందువల్ల ప్రజలను దృష్టిలో నుంచుకొని ఓ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని వ్యాఖ్యానించింది.

In big relief to Haldwani residents, Supreme Court stays HC's eviction order | India News | Zee News

హల్ద్వానీ లోని బన్ ఫూల్పుర ఏరియాలో సుమారు 29 ఎకరాల భూమి తమదేనని, అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు బస్తీలను ఏర్పరచుకుని దీన్నిఅక్రమంగా ఆక్రమించుకున్నారని రైల్వే శాఖ లోగడ పేర్కొంది. దీనిపై హైకోర్టుకు ఎక్కడంతో ఈ నెల 9 లోగా ఇక్కడివారిని ఖాళీ చేయించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే వీటిని సవాలు చేస్తూ.. బస్తీవాసులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ ప్రాంతంలో ఓ బ్యాంక్ తో సహా పలు స్కూళ్ళు, ఆలయాలు, మసీదులు, షాపులు ఉన్నాయి. సుమారు 400 కుటుంబాల వారు ఇళ్ళు నిర్మించుకున్నారు. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు అమలైన పక్షంలో మెగా కూల్చివేతలకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇలా అయితే తామంతా ఎక్కడకు పోవాలని వీరంతా ఇన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.

వీరి పిటిషన్ ను జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకా విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు నోటీసులు జారీ చేశారు. ఈ సమస్యకు సానుకూలమైన పరిష్కారం అవసరమని ఈ బెంచ్ పేర్కొంటూ.. దీనిపై ఫిబ్రవరి 7 న తదుపరి విచారణ జరగాలని నిర్ణయించింది. ఈ బస్తీ వాసుల పునరావాసానికి ఓ పథకం రూపొందించాలని, వీరి హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని.. అదే సమయంలో రైల్వే శాఖ అవసరాలను కూడా పరిశీలించవలసి ఉంటుందని కోర్టు పేర్కొంది.

Primary Sidebar

తాజా వార్తలు

షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు.. కానీ..!

రైతు ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు…!

పుతిన్ ను వ్యతిరేకిస్తూ పోస్టులు… యువతిని ఉగ్రవాదులు జాబితాలో చేర్చిన రష్యా…!

మంత్రి హరీష్ ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. కానీ ఫేక్ మినిస్టర్

గవర్నర్ తమిళిసైతో ముగిసిన మంత్రుల సమావేశం

రాజ్‌ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి….!

వంద రూపాయలతో వచ్చి ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి….!

శాకుంతలంకు సమంతా ఈ రేంజ్ లో తీసుకుంటుందా…?

భారీ లాభాలు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే…!

మగాళ్ళకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, నటుడి సంచలన కామెంట్స్…!

నితిన్ – తేజా ఎందుకు మాట్లాడుకోవట్లేదు…?

‘ఆ అన్న చెల్లెళ్లిద్దరూ స్నో బాల్స్ తో ఆడారు.. మోడీ చలవే మరి ‘

ఫిల్మ్ నగర్

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap