• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » జోషీమఠ్ పై 16 న విచారణ.. సుప్రీంకోర్టు

జోషీమఠ్ పై 16 న విచారణ.. సుప్రీంకోర్టు

Last Updated: January 10, 2023 at 2:46 pm

 

జోషీమఠ్ పై అత్యవసర విచారణ చేపట్టాలన్న పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. జనవరి 16 న ఈ పిటిషన్లను విచారిస్తామని పేర్కొంది. దేశానికి ముఖ్యమైన ప్రతి అంశంపైనా ఈ కోర్టుకు రావలసిన అవసరం లేదని, ఇలాంటి వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యవస్థలు చూసుకుంటాయని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ ను విచారిస్తోంది.

Joshimath subsidence: Supreme Court agrees to hear plea on January 16

 

 

స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తరఫున అడ్వొకేట్ పరమేశ్వర్ నాథ్ మిశ్రా.. దీన్ని దాఖలు చేశారు. జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. జోషి మఠ్ లో పెద్దఎత్తున పారిశ్రామికీకరణ కారణంగా అక్కడ ఇళ్ళు, రోడ్లు పగుళ్లు వారుతున్నాయని, వేలాది ప్రజలు నిరాశ్రయులవుతున్నారని ఆయన అన్నారు. వారి తక్షణ పునరావాసం, వారికి ఆర్ధిక సాయం ఎంతయినా అవసరమని పేర్కొన్నారు.

ఈ విపత్కర సమయంలో అక్కడి ప్రజలను ఆదుకోవాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించారు. మానవ ప్రాణాలను పణంగా పెట్టి అభివృద్ధి అన్నది సహేతుకం కాదని, సామాన్య ప్రజలకు ఏదైనా హాని జరిగితే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే అవుతుందన్నారు.

జోషి మఠ్ లో తమ పూర్వీకుల ఇళ్లను కూలగొట్టే కార్యక్రమానికి అధికారులు పూనుకోవడంతో అనేకమంది కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నేళ్ళుగా తాము ఉంటున్న ఇళ్ళు, ఇతర కట్టడాలు నేలమట్టం కానున్నాయని, కానీ తాము సురక్షితంగా ఉండాలంటే..ప్రమాదకరంగా మారిన వీటిని ఖాళీ చేయక తప్పడం లేదని స్థానికులు పేర్కొన్నారు. ఇక్కడ అప్పుడే రెండు హోటళ్లను అధికారులు కూల్చివేశారు. జోషి మఠ్ కి సమీపంలోని కర్ణప్రయాగ్ లో కూడా కొండచరియలు విరిగి పడుతున్న కారణంగా అనేక ఇళ్లలో పగుళ్లు కనిపిస్తున్నాయి. సుమారు 50 ఇళ్ళు ప్రమాదకరంగా మారడంతో ఆ ఇళ్లలోనివారు వాటిని ఖాళీ చేయడం ప్రారంభించారు.

Primary Sidebar

తాజా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ రిప్లై…!

కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..!

ముగిసిన జమున అంత్యక్రియలు

అందుకే తేజస్వీ యాదవ్‌ను సీఎంగా నితీశ్ ఎంచుకున్నారు…!

ఖమ్మం కయ్యం.. కౌంటర్ ఎటాక్స్ తో హీట్ 

ఫిల్మ్ నగర్

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap