చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడి బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిందితుడు రాకేశ్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, జయరాం హత్య కేసులో పోలీసుల పాత్ర ఉందని నిందితుడి తరుపున న్యాయవాది వాదించారు. దీనికి బదులుగా ఆరోపణలు ఉన్న పోలీసులపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెలిపారు.
తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులపై బెయిలబుల్, ఇతరులపై నాన్బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.