నారాయణ,
సీపీఐ జాతీయ కార్యదర్శి.
ఢిల్లీలో గత కొంత కాలంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కేంద్రం నియమిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు మధ్య వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కి మధ్య జరుగుతున్న పోరుపై గతంలో విచారణ జరిపిన కోర్టులు.. ప్రభుత్వం కంటే గవర్నర్ కే అధికారం ఉందని తేల్చి చెప్పాయి.
ఇవాళ సుప్రీంకోర్టు ఆ తీర్పులను కొట్టివేసింది. తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో సీఎం కేజ్రీవాల్ సర్కార్ కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు లాంటిది.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి హక్కులు లేకుండా చేస్తే ఎలా..?. ఢిల్లీ సీఎం ని పంజరంలో చిలకలా బంధించాలని కేంద్రం చూస్తుంది. ఇది ముమ్మాటికీ ప్రజా తీర్పును వ్యతిరేకించడమే.
సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. తెలంగాణ, పాండిచ్చేరి, కేరళ గవర్నర్ లు కూడా పరిధి దాటి వ్యవహరిస్తున్నారు.