• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » భూవివాదాల్లో ఎస్.ఐ…త్వరలో సస్పెన్షన్ వేటు..?

భూవివాదాల్లో ఎస్.ఐ…త్వరలో సస్పెన్షన్ వేటు..?

Last Updated: February 21, 2020 at 3:19 pm

భూ వివాదంలో తలదూర్చి బెదిరింపులకు పాల్పడిన ఓ ఎస్సై ని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసి అధికారులు విచారణ జరుపుతున్నారు. త్వరలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడనున్నట్టు తెలిసింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల ఎస్సై శ్రీనివాస్ భూ వివాదంలో ఇరుక్కున్నారు. నరసింహులు అనే వ్యక్తిని భూ కొనుగోలు, విక్రయ కేసులో భయభ్రాంతులకు గురి చేశారన్న ఫిర్యాదు జిల్లా పోలీస్ ఉన్నతాదికారులకు అందాయి. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ పై పోలీస్ శాఖ విచారణ చేపట్టింది.

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సర్వే నంబర్లు 573, 570 , 575, 619, 620 621 లలో 16 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి రాయచూర్ జిల్లా శ్రీనగర్ క్యాంపు ప్రాంతానికి చెందిన వెంకటనారాయణ కు చెందినది. ఈ 16 ఎకరాల భూమి గట్టు ప్రాంతంలో ఉండటంతో… వెంకటనారాయణ పొలంలోని 8 ఎకరాల 20 గుంటల భూమిని 2018 సంవత్సరంలో గట్టు మండలం కు చెందిన సరోజమ్మ , వీరేష్ లక్ష్మి లు కొనుగోలు చేశారు. మిగతా భూమి వెంకటనారాయణే ఉంచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సరోజమ్మ, వీరేష్ లక్ష్మి మిగతా భూమి కూడా తమకే అమ్మాలని భూ యజమాని వెంకటనారాయణ ను కలిశారు. మిగతా భూమి కూడా మీకే విక్రయిస్తానని వెంకటనారాయణ వారికి హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో భూ విక్రయాలు కొనసాగించే ఇద్దరు ఏజెంట్లు గట్టు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని కలిసి వెంకటనారాయణ భూమి తక్కువ రేటుకు ఇప్పిస్తామని, మీరు కొనుగోలు చెయ్యాలని చెప్పడంతో ఎస్సై శ్రీనివాస్ ఆ భూమిని తన మామ పేరు మీద భూమి కొనుగోలు చేయించారు. కొన్ని రోజుల తర్వాత అంతకు ముందు 8 ఎకరాలు కొనుగోలు చేసిన వారు మళ్లీ వెంకటనారాయణ ను కలిసి మిగులు భూమిని మాకు అమ్మాలని కోరారు. దీంతో భూ యజమాని మిగిలిన భూమిని మీకు ఇవ్వలేను…ఆ భూమిని గట్టు ఎస్ఐ తాలూకు వారికి అమ్మానని చెప్పడంతో వారు గట్టు ఎస్సైని కలిసారు. ఈ క్రమంలో ఎస్సైకి, కొనుగోలు దారుల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలో చర్చానీయాంశంగా మారింది.

తాను కొనాలనుకున్న భూమి తమకు దక్కలేదన్న కోపంతో సరోజమ్మ, వీరేష్‌ లక్ష్మీలు గద్వాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అట్టి భూమిపై క్రయ విక్రయాలను ఆపాల్సిందిగా వినతిపత్రం ఇచ్చారు.

తన బందువులు కొన్న భూమి రిజిస్ట్రేషన్ ఆపాలంటూ ఎందుకు కంప్లైంట్ చేశావని సరోజమ్మ, వీరేష్‌ లక్ష్మిల బంధువు నర్సింహులుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు గట్టు ఎస్సై శ్రీనివాస్. నరసింహులు మాత్రం ఎసై నన్ను స్టేషన్ కు పిలిపించి నా పై చేయి చేసుకున్నాడని, ఎస్సై పై చర్యలు తీసుకోవాలని గద్వాల ఎస్పీ కి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై విచారణ జరిపిస్తానని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఎస్సై, భూ కొనుగోలు దారుల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలో ఎస్సై వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎస్.ఐ వ్యవహారం రచ్చ.. రచ్చ కావడంతో ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు. విచారణ అనంతరం ఎస్.ఐ. పై సస్పెండ్ వేటు పడే అవకాశముంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

శ్వేతా చౌదరి కేసులో కొత్త కోణం

సర్వీస్ ఛార్జ్ విధించడం నిషేధం..

సైదిరెడ్డి.. ఎందుకీ కక్కుర్తి!

న‌గ‌రంలో భారీ వ‌ర్షం.. ఇబ్బందుల్లో ప్ర‌జ‌లు..

వారికి భ‌ర్త శ‌త్రువుతో స‌మానం..!!

బుమ్రా అకౌంట్లో మ‌రో రికార్డు..

కాఫీలు అందించిన ట్విట్ట‌ర్ సీఈవో..!!

చేత‌నైతే ప‌ట్టుకోండి చూద్దాం..!!

డోర్నకల్ టీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు

కేబినెట్ విస్తరణ… మంత్రులుగా ఐదుగురు ప్రమాణం…!

కుక్క మొరిగింద‌ని..!?

కాంగ్రెస్‌ లో చేరిన టీఆర్‌ఎస్‌ మేయర్‌!

ఫిల్మ్ నగర్

ఆర్ ఆర్ ఆర్ ఒక ‘గే ల‌వ్ స్టోరీ’ : ఆస్కార్ గ్ర‌హీత‌

ఆర్ ఆర్ ఆర్ ఒక ‘గే ల‌వ్ స్టోరీ’ : ఆస్కార్ గ్ర‌హీత‌

కాళీ పోస్టర్ వివాదాస్పదం... !

కాళీ పోస్టర్ వివాదాస్పదం… !

సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?

సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?

నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!

నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!

షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

'మాచర్ల..' సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్

‘మాచర్ల..’ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్

ఎప్పుడో ఆగిన సినిమా ఇప్పుడు సెట్స్ పైకొచ్చింది

ఎప్పుడో ఆగిన సినిమా ఇప్పుడు సెట్స్ పైకొచ్చింది

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)