మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిర్జాదిగూడలో దారుణం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాల 8 వ తరగతి చదువుతున్న బాలిక అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపురం గ్రామానికి చెందిన అనిత.. సమ్మర్ హాలిడేస్ ముగించుకొని రెండు రోజుల క్రితమే హాస్టల్ కు వచ్చింది. ఇంటి వద్ద నుండి సంతోషంగా వచ్చిన బాలిక ఉన్నట్టుండి విగతజీవిగా కనిపించడంతో తల్లదండ్రులు ఆందోళనకు దిగారు.
తమ కూతురు మరణానికి కారణం చెప్పాలని గురుకుల సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లిదండ్రులు. హాస్టల్ లో నాణ్యమైన ఫుడ్ పెట్టకపోవడంతో.. ఫుడ్ పాయిజన్ తో తమ బిడ్డ చనిపోయిందంటున్నారు.
అయితే.. హాస్టల్ ఉన్న అనితకు హార్ట్ అటాక్, ఫిట్స్ వచ్చాయని గురుకుల సిబ్బంది చెప్తున్నారు. అయితే.. ఇంటివద్ద నుండి ఆరోగ్యంగా స్కూల్ కు వచ్చిన అమ్మాయికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.