హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పై హైకోర్టులో కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలైంది. సీవీ ఆనంద్ తో పాటు సైఫాబాద్ పోలీసులపై కూడా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు.
అసెంబ్లీ ముట్టడిలో భాగంగా తనని అక్రమంగా అరెస్ట్ చేశారని, 41 ఏ నోటీస్ ఇవ్వకుండానే పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు వెంకట్.
అరెస్టుకు ముందు నోటీసులు ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాలను తన విషయంలో పోలీసులు పాటించలేదని పిటిషన్ లో తెలిపారు.
తనను అక్రమంగా అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీపీ ఆనంద్ తో పాటు నలుగురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు బల్మూరి వెంకట్.