నందమూరి తారకరత్నకు బెంగళూరు బొమ్మసంద్రలో ఉన్న నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కుప్పం నుంచి అర్ధరాత్రి తర్వాత 2.30 గంటలకు అంబులెన్స్లో చేరుకున్నారు. అంబులెన్స్తో పాటూ నందమూరి బాలకృష్ణ, తారక రత్న భార్య అలేఖ్య రెడ్డిలు కూడా ఆస్పత్రికి వచ్చారు.
ఆస్పత్రిలో డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. తారకరత్నకు వైద్యులు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్(ఐసీసీయూ)లో వైద్యం అందిస్తున్నారు. ఆయనకు ఎక్మోపై వైద్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తారకరత్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు.
ఎక్మో అమర్చడం వల్ల ఆర్టిఫిషియల్గా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్ అందుతుంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రివర్గాలు ఇవాళ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి, చికిత్సను నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు సాయంత్రం 4.30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు రానున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్, కల్యాణ్రామ్ కూడా బెంగళూరుకు వెళ్లనున్నారు.