• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » టాటాకు ఎయిరిండియా అప్పగింత.. రేపటి నుంచి సేవలు..!

టాటాకు ఎయిరిండియా అప్పగింత.. రేపటి నుంచి సేవలు..!

Last Updated: January 27, 2022 at 10:23 pm

ఎయిరిండియా పూర్తిగా టాటా చేతికి వచ్చేసింది. అన్ని లాంఛనాలను పూర్తి చేసి కేంద్రం అప్పగించింది. రూ.18వేల కోట్లు చెల్లించి ఎయిరిండియాలో 100 శాతం వాటాలను టాటా కొనుగోలు చేసింది. శుక్రవారం నుంచి టాటా ఆధ్వర్యంలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విమానం క‌రాచీ నుండి ముంబైకి రానుంది.

69 ఏళ్ల తర్వాత అధికారికంగా టాటాకు ఎయిరిండియా దక్కింది. ఈ మేరకు అఫీషియల్ ప్రాసెస్ పూర్తయింది. కంపెనీ షేర్లను తలాస్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ సంతోషంలో మునిగిపోయింది. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఆసక్తికర ట్వీట్ చేసింది. దాన్నిబట్టి ఎయిరిండియా అంటే ఆ సంస్థకు ఎంతటి మమకారమో అర్థం అవుతోంది.

Your arrival was much awaited, @airindiain. #AirIndiaOnBoard #ThisIsTata pic.twitter.com/OVJiI1eohU

— Tata Group (@TataCompanies) January 27, 2022

ఎయిరిండియా కోసం చాన్నాళ్లుగా ఆతృతగా ఎదురు చూశామని.. వెల్కమ్ బ్యాక్ అంటూ టాటా గ్రూప్ ట్వీట్ చేసింది. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్ లైన్ గా మార్చేందుకు అవసరమైన ప్రతి ఒక్కరితో కలసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అటు ప్రధాని మోడీ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు.

1953లో జాతీయికరణలో భాగంగా టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ ను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో అది కాస్తా ఎయిరిండియాగా మారింది. విమానయాన రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతించాక నష్టాల బాట పట్టింది. 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ తో విలీనం అనంతరం నష్టాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను విక్రయించేందుకు ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించింది. అందులో టాటా సంస్థ దక్కించుకుంది.

Primary Sidebar

తాజా వార్తలు

తానా సభల్లో ఇళయారాజా కచేరి!

నేను అలా అనలేదు..అర్థాలు మార్చకండి!

కోరమాండల్ ప్రమాదంపై మోడీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

జీవితం చాలా చిన్నది..టైం అయిపోగానే!

రైలు ప్రమాదం పై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు!

మావోయిస్ట్ అగ్రనేత మృతి!

సెగలు కక్కుతున్న సూరీడు..టెంపరేచర్ 46 డిగ్రీలు!

పెళ్లి చేసుకున్న రుతురాజ్‌!

రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలి.. విపక్షాలు

అన్నీ తానై!

అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

రైలు ప్రమాద బాధితులకు ఎల్ఐసీ షరతుల సడలింపులు

ఫిల్మ్ నగర్

ilayaraja live concert at tana mahasabhalu

తానా సభల్లో ఇళయారాజా కచేరి!

megastar chiranjeevi on rumours of getting cancer

నేను అలా అనలేదు..అర్థాలు మార్చకండి!

actress anupama parameswaran interesting comments

జీవితం చాలా చిన్నది..టైం అయిపోగానే!

sonu sood reacts on odisha train accident

రైలు ప్రమాదం పై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు!

netizens fires on comedian rahul ramakrishna for his videos

ఈ సమయంలో ఇలాంటి వీడియోలా? కమెడియన్ పై నెటిజన్ల ఫైర్

megastar chiranjeevi shocking comments on cancer

నాకూ క్యాన్సర్ వచ్చింది.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్

తిరుపతిలో అంగరంగ వైభవంగా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్...!?

తిరుపతిలో అంగరంగ వైభవంగా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్…!?

celebreties react on coromandel express train accident incident

ఘోరంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap