టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు ఇంటివద్ద నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు. ఏపీని చెత్త నా కొడుకులే పాలిస్తున్నారంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
దెబ్బకు దెబ్బ ఖాయమని.. టీడీపీ వాళ్లవి ఒక ఇల్లు కొడితే మేం పది ఇళ్లు కొడతామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ప్యాలెసును కూలగొట్టడం ఖాయమంటూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఏపీ వదిలి పారిపోయేలా చేస్తామన్నారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు బీసీలు బ్రహ్మరధం పట్టారని తెలిపారు. బీసీ నేత అయ్యన్నను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. జగన్ టార్గెట్ చేస్తోంది అయ్యన్నను కాదని.. బీసీలనేన్నారు. బీసీలంటే అంత చులకనా..? అని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబును ముసలి నక్కా అంటూ విజయసాయి రెడ్డి అనే కుక్క మాట్లాడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిని కుక్క అంటే కుక్క కూడా సిగ్గు పడుతుందంటూ ధ్వజమెత్తారు. అయ్యన్నతో సహా బీసీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జగన్ తప్పిదాలను ఎండగడతామని ఆయన వెల్లడించారు బుద్దా వెంకన్న.