• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

విజయసాయి భూముల కోసమేనంటూ దేవినేని సంచలన వ్యాఖ్యలు

Published on : December 18, 2019 at 6:25 pm

ఏపీ రాజధానిగా విశాఖను ప్రకటించటం వెనుక ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా. సీఎం జగన్ సూచనల మేరకు విశాఖపట్నం చుట్టు ప్రక్కల మధురవాడ, భోగాపురం ప్రాంతంలో విజయసాయి రెడ్డి తో పాటు వైకాపా నేతలు కొనుగోలు చేసిన 6వేల ఎకరాల భూములపై సీబీఐ విచారణ జరిగితే అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటో బట్టబయలవుతుందన్నారు.

జగన్ తెలివితక్కువ నిర్ణయాలతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి… కుల మతాలకు, ప్రాంతాలకు మధ్య చిచ్చు పెడుతున్నాడని దేవినేని ఆరోపించారు. ఏడు నెలలుగా కుట్రలు కుతంత్రాలతో కూడిన ఆలోచనలతో శాసన సభ్యులు, మంత్రులతో ప్రకటనలు గుప్పించి.. నేడు 9వేల కోట్ల పైనే పనులు జరిగిన అమరావతి గొంతుకోసేశారన్నారని మండిపడ్డారు.

అమరావతి కేంద్రంగా అన్ని శాఖలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఓర్వలేక, తట్టుకోలేని జగన్ ఇటువంటి కుట్రలకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్టు నేడు రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ముఖ్యమంత్రి తాడేపల్లి భవనంలో వీడియో గేములు ఆడుకుంటున్నారని, కక్షతో విద్వేషంతో రాజధాని పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై మంత్రులు ఇప్పటికైనా నోరు తెరవాలని డిమాండ్ చేశారు. 29గ్రామాల్లో దాదాపు 29వేల మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు యువత పురుగుమందు డబ్బాలతో ప్రాణ త్యాగాలకు సిద్ధపడే పరిస్థితి తెచ్చారని, అనంతపురం నుంచి విశాఖ వెళ్లాలంటే 890 కిలోమీటర్లు వెళ్ళాలి. కర్నూలు నుంచి 600కిలోమీటర్ల పైనే దూరం ఉంది. పిల్లచేష్టలతో అనుభవరాహిత్యంతో ముఖ్యమంత్రి తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం పక్కన పెట్టి తెలుగుదేశం ప్రారంభించిన అభివృద్ధిని కొనసాగించి, రాజధానిపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.

tolivelugu app download

Filed Under: ఫటాఫట్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య తెలుగు మూవీ...?

బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య తెలుగు మూవీ…?

లక్ష్య టీజ‌ర్ అదుర్స్

లక్ష్య టీజ‌ర్ అదుర్స్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)