ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. జగన్ తనకు అనుకూలంగా రాజధానిపై జీఎన్.రావు కమిటీతో రిపోర్ట్ ఇప్పించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల మద్య చిచ్చు పెడుతోందని ఆమె ఆరోపించారు. రాయలసీమ నుంచి విశాఖకు రోడ్ కనెక్టివిటీ ఉందా? అని అఖిలప్రియ ప్రశ్నించారు. అసలు సామాన్యులు విశాఖకు వెళ్లే పరిస్థితి ఉందా అంటూ మండిపడ్డారు. విశాఖలో హుద్ హుద్ తుఫాన్ రాలేదా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్నారు. ప్రభుత్వ తీరును యువత ప్రశ్నించాలని అఖిలప్రియ కోరారు.