పట్టాభి రామ్, టీడీపీ నేత
మాదక ద్రవ్యాలకు ఏపీని చిరునామాగా మార్చారు. టన్నుల టన్నుల హెరాయిన్ ను రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తుంటే ఏం జరగలేదంటూ డీజీపీ స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు. ఈ కుట్రంతా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతాం. ఏరకంగా వైన్ షాపుల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి నల్ల డబ్బు సంపాదిస్తున్నారో.. ఏ రకంగా తాలిబన్లకు చెల్లింపులు చేస్తున్నారో.. ఏరకంగా పోర్టులన్నింటినీ హస్తగతం చేసుకుని డ్రగ్స్ ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారో.. మొత్తం బయటపెడతాం. ఏపీని డ్రగ్గాంధ్రప్రదేశ్ గా మార్చారు.
వైన్ షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పే ఎందుకు లేవు.. కేవలం క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు. హెరాయిన్ విషయంలో దర్యాప్తు లేకుండానే క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారు. మత్తు పదార్థాలను ఎక్కడి నుంచి కొంటున్నారు. నల్లధనం మొత్తం ఎక్కడకి పోతోంది..? విజయవాడ సెంటర్ లో దుకాణాన్ని తెరిచి.. టన్నుల టన్నుల హెరాయిన్ ను ఎక్కడికి పంపిస్తున్నారు.
జగన్ లో నిజాయితీ ఉంటే వైన్ షాపుల్లో ఫోన్పే, గూగుల్ పే లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెట్టాలి. దేశంలోనే జగన్.. అతిపెద్ద లిక్కర్ డాన్ గా మారారు. వైసీపీ నేతలకు దమ్ముంటే అన్ని రంగాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులోకి తేవాలి. లిక్కర్ మాల్స్ ని ప్రైవేట్ చేతికి అప్పగిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ పెడితే తమ బండారం బయటపడుతుందని.. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. మద్య నియంత్రణ అంటే ఇదేనా..?