• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Andhra Pradesh » వైసీపీ నేతలపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు…!

వైసీపీ నేతలపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు…!

Last Updated: August 5, 2022 at 9:22 pm

తెలుగు దేశం పార్టీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏడీజీకి ఆయన లేఖ రాశారు.

సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు నిస్సిగ్గుగా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నారా లోకేశ్ పై
ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. దేవేందర్‌రెడ్డి చెబుతున్నట్టుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవన్నారు.

వైసీపీ నాయకులు ప్లాట్ నెం. 3, రోడ్ నంబర్. 12, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్ నుంచి నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ నాయకులపై హత్యారాజకీయాల పేరుతో ఎంపీ విజయసాయి కూడా అసత్య ప్రచారాలు చేశారని పేర్కొన్నారు.

దీనిపై ఫిర్యాదు చేసేందుకు 3 ఆగస్టు 2022న టీడీపీ నాయకులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబులు మంగళగిరి రూరల్ సీఐ భూషణంని సంప్రదించారని చెప్పారు. కానీ తమ నాయకుల పట్ల సీఐ బాధ్యతారాహత్యంగా ప్రవర్తించారని తెలిపారు.
సీఐ తన ప్రాథమిక బాధ్యతలను విస్మరించి తమ నాయకులతో అసభ్యకరంగా దుర్భాషలాడారని మండిపడ్డారు.

Advertisements

ఇప్పటి వరకు తాము చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, విజయసాయి రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఫిర్యాదు దారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Primary Sidebar

తాజా వార్తలు

ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం… ఆరుగురు మృతి

క్రిప్టో మోసాలపై సైబర్ సెక్యూరిటీస్ వెంచర్స్ సంచలన నివేదిక..!

ప‌శువుల‌పై విరుచుకుప‌డుతున్న లంపీ!!

జగ్గారెడ్డి కాంగ్రెస్ ను వీడనున్నారా..?

మాచర్ల నియోజకవర్గం ప్రీ-రిలీజ్ బిజినెస్

ప్రకటన వచ్చింది.. కొత్త మేటర్ మాత్రం లేదు

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

మ‌రెవ‌రికి ఇలా కాకూడ‌దు!!

న్యాయవాదికి న్యూడ్ కాల్స్.. ఆపై బెదిరింపులు

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

మరోసారి మాస్ Vs క్లాస్

త‌గ్గిస్తున్నాం.. ఎక్కుతారా..?

ఫిల్మ్ నగర్

మాచర్ల నియోజకవర్గం ప్రీ-రిలీజ్ బిజినెస్

మాచర్ల నియోజకవర్గం ప్రీ-రిలీజ్ బిజినెస్

ప్రకటన వచ్చింది.. కొత్త మేటర్ మాత్రం లేదు

ప్రకటన వచ్చింది.. కొత్త మేటర్ మాత్రం లేదు

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

మరోసారి మాస్ Vs క్లాస్

మరోసారి మాస్ Vs క్లాస్

హీరోయిన్ ను చూస్తే పంత్ కు జాలేస్తుందంటా...

హీరోయిన్ ను చూస్తే పంత్ కు జాలేస్తుందంటా…

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

v-v-vinayak

కళ్యాణ్ రామ్ కు వినాయక్ థాంక్స్ ఎందుకు చెప్పాడు?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)