అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం బాధాకరం. శాంతి భధ్రతలు అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వైసీపీ పాలనలో రాష్ర్టం అబద్దాలకు, అరాచకానికి, వంచనకు చిరునామాగా మారింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల్ని అందుకు సహకరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. తప్పు చేసిన వారు చంద్రమండలంలో దాక్కున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదు.
అధికారమదంతో మీరు చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు మాజీ జెడ్పీటీసీ బత్తిన శారద ఇంటిపై దాడి చేసి ఇల్లు, వాహనాలు దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వినాయక ఊరేగింపులో ఇలాంటి అరాచకం ఏంటి..? ఘటనా స్ధలంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం.. వ్యవస్ధ పనితీరుకు అద్దం పడుతోంది. టీడీపీ కార్యకర్తల ఇళ్ల మీదకు వచ్చి వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది..?
Advertisements
హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈవిధంగా దాడులు జరుగుతున్నాయంటే రాష్ర్టంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోంది. బత్తిన శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. రాష్ర్టంలో వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వినాయకుని నిమజ్జనం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్ల రాజ్యం స్ధాపిద్దామనుకుంటున్నారా..? ఆంధ్రప్రదేశ్ కి ఆఫ్ఘనిస్తాన్ కి తేడా ఏంటి..?