సాధారణంగా చంద్రబాబు.. ప్రభుత్వ వ్యవహారాలపై స్పందించినంత వేగంగా పార్టీ పరిణామాలపై స్పందించరు అని ఒక అపవాదు. అయితే… జగన్ పాలన చంద్రబాబులో మార్పు తెచ్చింది. ఏపీలో వరుస పరిణామాలపై చంద్రబాబు అణువణువు గమనిస్తూ చాలా వేగంగా స్పందిస్తున్నారు’ అంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ సీతారామ్..
ప్రభుత్వం అండ చూసుకుని తెలుగుదేశం సానుభూతిపరులను వేధించే వైసీపీ వాళ్ల మీద యుద్ధం ప్రకటించారు చంద్రబాబు. పరిస్థితులను మీకు సరిదిద్దడం చేతకాలేదు కాబట్టే తాను రంగ ప్రవేశం చేశానని గతంలో ఒకసారి పాలకుల్ని తీవ్రంగా హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు ఆ అరాచకాలు ఆగకపోవడంతో సీరియస్గా పరిగణిస్తున్నారు. క్యాంపులతో పల్నాడు పాలిటిక్స్ హిట్ ఎక్కుతున్నాయి. ప్రభుత్వ బాధితుల పునరావాసం ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఏపీ సర్కారు బ్లేమ్ అయ్యింది. నేషనల్ మీడియా టాపిక్ అయ్యింది.
సినిమాల్లో తప్ప మామూలుగా కనిపించని ఊరు వదిలి వెళ్లిపోయే సీన్లు… గ్రామాల్లో రాజకీయాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడు ఎక్కడా ఇలాంటి సీన్లు కనిపించలేదు. చంద్రబాబు పార్టీని తిట్టినా క్షమిస్తాడు గానీ శాంతిభద్రతల్లో విఫలం కావడాన్ని అసలు క్షమించడు అంటారు. అందువల్లే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఇలాంటి సీన్లు కనిపించలేదు. శాంతి భద్రతల విషయంలో సొంత వారు, వేరే వారు అనే వ్యవహారం బాబు సర్కారులో కనిపించదు. కానీ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో అరాచకాలు చోటుచేసుకుంటున్నాఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పలేదు. శాంతియుతంగా ఉండాలని ఎవరినీ హెచ్చరించలేదు. పైగా సాక్షి పత్రికలోనే బాధితులపై నెగెటివ్ కథనాలు రావడంతో తమకు సీఎం మద్దతు ఉందని ఫీలైపోయిన అరాచకవాదులు పెచ్చరిల్లిపోతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తలపెట్టారు. పల్నాడు ప్రాంతంలో గ్రామాలు విడిచిన బాధితులను పార్టీ స్వయంగా వారి గ్రామాల్లో దింపనుంది. పరిస్థితి విషమించడంతో ఇక దొరికిపోతాం అని భావించిన ప్రభుత్వం పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెట్టింది. తాజాగా నిన్న పోలీసులు 14 కుటుంబాలను సొంత గ్రామాల్లో వదిలిపెట్టి రాజీ చేయించారు. స్వయంగా చంద్రబాబు అనేకసార్లు హెచ్చరించినా పట్టించుకోని జగన్… చంద్రబాబు సీరియస్ డెసిషన్ తీసుకోవడంతో అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు ఉన్నారు. అందుకే హోం మంత్రి ప్రెస్ మీట్ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చెబుతుంటే… లోపాయకారీగా పోలీసులు చర్యలు మొదలుపెట్టారు.
మొత్తానికి చంద్రబాబు ఉద్యమ సెగ జగన్ సర్కారుకు తగిలింది.144 సెక్షన్ విధించినా… ఛలో ఆత్మకూరు కచ్చితంగా జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పారు. “గౌరవ హోంమంత్రి సుచరిత గారు పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉన్నాయని చెబుతుంటే, పోలీస్ బాస్ డీజీపీ మాత్రం పల్నాడులో సాధారణ పరిస్థితులు లేవని అంటున్నారు. పల్నాడులో 144 సెక్షన్ ఉందని చెబుతున్నారు” ఎవరి మాటలు నమ్మాలి..? అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఈ భయం, జాగ్రత్త ముందే ఉండాల్సిందని లోకేష్ అంటున్నారు. అదీ సంగతి!