ఐసీసీ మహిళా వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో వెస్టీండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు దుమ్ము లేపింది. కరేబియన్ జట్టుపై 153 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.వెస్టిండీస్ జట్టు ముందు భారత్ 153 పరుగుల టార్గెట్ ఉంచింది.లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు.వేగంగా పరుగులు రాబడుతూ మొదటి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
మంచి ఊపు మీద ఉన్న ఓపెనర్ డియాండ్ర డాటిన్(62)ను భారత బౌలర్ స్నేహా రానా అవుట్ చేశారు.ఆ తర్వాత మరో 8 పరుగులకు మరో ఓపెనర్ హెలే మ్యాథ్యూస్(43) ను స్నేహరానా పెవిలియన్ కు చేర్చారు.ఆ తర్వాత వచ్చిన వాళ్లలో చెడియన్ నేషన్(19), షెమేన్ క్యాంప్ బెల్ (11) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ ను చేయలేకపోయారు.దీంతో 40.3 ఓవర్లలో వెస్టిండీస్ 162 పరుగులకే ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో స్నేహ్ రానా మూడు వికెట్లు తీశారు.మేఘనా సింగ్ 2, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, జులన్ గోస్వామి తలో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఓపెనర్లు స్మృతి మంధాన(123), హర్మన్ ప్రీత్ కౌర్(109) లతో విండీస్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. దీంతో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు సాధించింది.