వెస్టిండీస్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ 2-0తో తిరుగులేని అధిక్యంలో నిలిచింది. దీంతో సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్కు ఇది వరుసగా 8వ ఓటమి. అంతకుముందు చివరి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్తో సిరీస్ను కైవసం చేసుకోవడం ద్వారా భారత్ కూడా తన పవర్ చూపించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో భారత జట్టు 2 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విధంగా, వెస్టిండీస్ ఈ సిరీస్ను కోల్పోవడమే కాకుండా, 2019 ప్రపంచ కప్ తర్వాత, మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్లను కోల్పోయిన వారి ట్రాక్ రికార్డ్ మరింత దిగజారింది.
చివరి 10 ఓవర్లలో భారత్ 100 పరుగులు..
312 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేసి ఆకట్టుకుంది. 2001 తర్వాత చివరి 10 ఓవర్లలో పరుగుల వేటలో ఇది నాలుగో అత్యధిక స్కోరుగా నిలిచింది.
భారత్ తరపున శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పునరాగమనం చేసిన అక్షర్ పటేల్ జోరుతో వెస్డిండీస్ టీంను చిత్తు చేశాడు. అతను 35 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్ని ఆడాడు. అది టీమ్ ఇండియా విజయానికి పనికొచ్చింది. ఎడమచేతి వాటం ఆటగాడు అక్షర్ పటేల్ 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 64 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీనికి అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.