• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఆ లక్ష్యాన్ని సాధించేందుకు దేశానికి సాంకేతికత తోడ్పడుతుంది…!

ఆ లక్ష్యాన్ని సాధించేందుకు దేశానికి సాంకేతికత తోడ్పడుతుంది…!

Last Updated: February 28, 2023 at 5:03 pm

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని సాధించేందుకు భారత్‌కు సాంకేతికత తోడ్పడుతుందని ప్రధాని మోడీ అన్నారు. సాంకేతికత, అందరికీ సమాన అవకాశాలను కల్పించేందుకు 2023 కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.

‘అన్‌లీషింగ్ ది పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’అనే వెబ్‌నార్ ను మంగళవారం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సలహాలు, సూచనలను కోరేందుకు ప్రభుత్వం వెబినార్స్ నిర్వహిస్తోంది.

బడ్జెట్ అనంతరం నిర్వహించిన వెబ్ నార్లలో ఇది ఐదవది. ఈ వెబ్ నార్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ… సాంకేతికత అనేది అందరికి సమానమైన అవకాశాలను కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం కూడా అదే దిశలో భారీగా పెట్టుబడులు పెడుతోందని ఆయన పేర్కొన్నారు.

ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడంతో పాటు, వాటి ప్రయోజనాలు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు. దీనితో పాటు, డిజిటల్ విప్లవ ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా వారు భరోసా ఇస్తున్నామన్నారు.

నేడు గవర్నమెంట్ ఇ మార్కెట్‌ప్లేస్ పోర్టల్ ఈ అవకాశాన్ని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులకు కూడా వారి ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇ-నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) రైతులకు వివిధ ప్రాంతాల నుండి కొనుగోలుదారులతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందించిందన్నారు. ఇప్పుడు రైతులు ఒకే చోట ఉంటూనే తమ ఉత్పత్తులకు ఉత్తమమైన ధరను పొందవచ్చన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న రాహుల్ గాంధీ…!

నేను మాత్రం రాను: రిషబ్‌!

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు వద్దు..!

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్ట్ వార్నింగ్!

నగరంలో ఐపీఎల్ మ్యాచ్ లు.. మెట్రో వేళలు పొడిగింపు

మోసపూరిత హామీతో యువతను కూడా దగా చేశారు కదా? .. బీజేపీపై కవిత ఫైర్..!

రాజా సింగ్ పై కేసు మీద కేసు

చుక్కల భూములపై ఏపీ సీఎం సంచలన నిర్ణయం.. కాకాణి రియాక్షన్

టీఎస్పీఎస్సీ కార్యదర్శి, సభ్యుడు ఏమని స్టేట్ మెంట్ ఇచ్చారంటే!

బహిరంగ చర్చకు సిద్ధమా? జీవన్ రెడ్డికి.. మంత్రి కొప్పుల కౌంటర్

ఐటీ ఉద్యోగి హత్య కేసులో ట్విస్ట్‌..తమ్ముడి వివాహేతర సంబంధమే కారణమా?

వాళ్ళ పేర్లేవో చెప్పండి’.. మోడీ ‘సుపారీ’ ఆరోపణలపై సిబల్

ఫిల్మ్ నగర్

rishab reaction about his political entry rumours

నేను మాత్రం రాను: రిషబ్‌!

there is talk in the industry that rashmika has increased her remunaration

భారీగా డిమాండ్‌ చేస్తున్న రష్మిక!

senior actor and producer costume krishna passed away

కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత!

shivatmika about ranga marthanda

అంత ఈజీ కాదు: శివాత్మిక!

aliya to priyanka chopra actresses who stole the show with loads of shimmer at nmac opening

తారలు దిగి వచ్చిన వేళ!

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ....ఎంతో తెలుసా.... !?

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్...వీడియో వైరల్ ..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap